Wednesday 15 April 2015

యూరేపియన్ బ్రహ్మణులు విదేశియులే;



యూరేపియన్ బ్రహ్మణులు విదేశియులే;
21-May-2001 లో TIMES OF INDIA లో ప్రచురించిన వార్తా అధారంగా అమెరికాలో వాషింగ్టన్ అట్ట విశ్వ విద్యాలయము ఉంది. దీనిలో బయోటెక్నాలజీ డిపార్ట్ మెంట్ యెక్క హెడ్ అఫ్ ది డిపార్ట్ మెంట్ మైకల్ బామ్ శాద్ గారు.భారత్ లోని బ్రాహ్మణులు భారతదేశం యొక్క మూలవాసులు కాదు.బ్రాహ్మణులు విదేశీయులు మరియు యురేషియాలో నివాసించేవారు.యురేషియా పేరుగల స్థలం రష్యా దగ్గర కాలసాగర్ లో ఉంటుంది.ఈ విషయాన్ని Dr. జయదీక్షిత్ గారు ఇతను పూనా యొక్క బ్రాహ్మనుడు.ఇతను అమెరికా యొక్క పౌరసత్వం గలవాడు.ఇతను కూడ మైకల్ బామ్ షాద్ యొక్క అనుసందానం ( రీసెర్చ్ ) ద్వారా బ్రాహ్మణులు విదేశీయులేనని ఋజువు చేశాడు.ఈ విదంగా అంతిమంగా ప్రమాణీకరించబడినది ఏమని అంటే భారత్ యొక్క బ్రాహ్మణులు యురేషీయన్ లు మరియు విదేశీయులు.
అసలు చరిత్ర ని, చరిత్ర పుస్తకాలను మార్చి వ్రాయాలనే తలంపు ఈ BJP, RSS వారికి ఎందుకు? ఒక్క దేశ చరత్ర అనేది ఒక్క యూనివర్సిటీకి లేదా ఒక్క ప్రొఫెసర్ రీసర్చ్ కి సంబంధించిన విషయం కాదు. ప్రపంచ వ్యాప్తంగా గల యూనివర్సిటీల ప్రొఫెసర్ లు, విద్యార్ధుల వందల సంవత్సరాల రీసెర్చ్ ఫలితం ఒక దేశ చరిత్ర. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మరియు ఇండియాలో గల యూనివర్సిటీ ల చరిత్ర కారులు, ఆర్కియాలజిస్టులు, ఇండాలజిస్టులు పరిశోధించి చెప్పిన దానికి, RSS వాళ్లు చెప్పేదానికి ఏమైనా పూర్తి విరుద్దమైన బేదాలు ఉన్నాయా? ప్రపంచంలోని దాదాపు పది ప్రసిద్ధ యూనివర్సిటీల్లో విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉంటూ, ప్రపంచంలోనే అరుదైన మేధావుల్లో ఒకరైన, అకడమిక్ అవార్డులు తప్ప, మిగతా ఎలాంటి అవార్డ్ లు తీసుకోనని, రెండు సార్లు పద్మభూషణ్ అవార్డ్ ని నిరాకరించిన, అత్యంత ప్రతిష్టాత్మకమైన అమెరికన్ "లైబ్రరి ఆఫ్ కాంగ్రెస్ క్లూగ్ చైర్" కి అపాయిమెంట్ అయిన ప్రముఖ హిస్టారియన్ రొమిల్లా తాపర్ (83) వంటి చరత్ర కారుల పుస్తకాలను ఎందుకు తగులబెట్టాలని పిలుపిస్తున్నారు.ఈ ప్రపంచ వ్యాప్త చరిత్ర కారుల పరిశోధనలు BJP, RSS వారి సిద్దాంతానికి, వీరి ఉనికికి భంగం కలిగించే, నష్టం కలిగించే ఎలాంటి సమాచారాన్ని కనుక్కున్నారు? ఎందుకు చరిత్ర కారులంటే వీరికి అంత భయం.
దీనికి ప్రధాన ముఖ్య కారణం ఆర్యన్ దండయాత్ర (Aryan Invasion or Migration) సిద్దాంతం. అంటే ఆర్య బ్రాహ్మణులు, ఆర్య క్షత్రియ, ఆర్య వైశ్యులు గా తమకు తాము చెప్పుకునే ఆర్యులు, ఇరాన్ నుండి వచ్చారు. ఈ ఆర్యులు ఇండియా మూలవాసులైన,సిందూ నాగరికతని శృష్టించిన వారిని శూద్రులు, చండాలురు గా చేసి మన ప్రస్తుత కుల వ్యవస్థని నిర్మించారని, ఆనాటి భూమి కలిగిన రైతులని అంటరాని వారిగా చేసి పంటలు పండించుకున్నారని ప్రపంచ వ్యాప్త యూనివర్సిటీల ఆర్కియాలజిస్టులు, భాషాశాస్త్రవేత్తలు, మానవశాస్త్రవేత్తలు, చరిత్ర కారులు, ఫిలాలజిస్టులు, అన్ని రకాల స్కాలర్స్, గత రెండు వందల సంవత్సరాలుగా ఎన్నో తవ్వకాలు జరిపి, ఎంతో రీసర్చ్ చేసి, ఎంతో శ్రమించి కనుక్కున్నారు.
అంటే ముస్లీం లు దండయాత్ర చేసి ఈ దేశాన్ని ఆక్రమించుకున్నట్లు, ఈ బ్రాహ్మణులు కూడా వేల సంవత్సరాల క్రితం ఇరాన్ నుండి వచ్చి ఇండియా మీద దండయాత్ర చేసి దేశాన్ని ఆక్రమించారు అని కనుక్కున్నారు. అంటే ప్రస్తుతం హిందూమతంగా పిలువ బడే, బ్రాహ్మణిజం మాతృ భూమి ఇరాన్ అన్నమాట.ధర్మ, కర్మ సిద్దాంతాల మాటున, మానవులు సంభాషించుకోడానికి కనిపెట్ట బడ్డ భాషని మంత్రాలు, తంత్రాలుగా మార్చి, శ్రమతో ప్రకృతిని, పదార్ధాన్ని మార్చె ప్రక్రియని అసహ్యమైనదిగ, తోటి మానవుణ్ణి అంటరానివారుగా, గుణం తక్కువ వారిగా, శూద్రునిగా, పందిని దేవుడి అవతార రూపంగా వర్ణిస్తూ వేదాల పేరుతో వ్రాసిన త్రివర్గ సిద్దాంత రెండు కోట్ల శ్లోకాలు, దేవుళ్లను 3339 (రుగ్వేదం 3.9.11) వర్గాలుగా, భారతదేశ ప్రజలను 6000 కులాలకు పైగా విడగొట్టి, దేవుడి పేరు చెప్పి ఆచారాల పేరుతో ప్రజలు త్రి వర్గ సిద్దాంతాన్ని పాటించటానికి ఒక పురోహిత వర్గాన్ని ఏర్పరచుకొని, ఇప్పటికీ తొంబై శాతంగా వున్న శూద్ర, అంటరాని ప్రజలు తమ కులం చెప్పుకోవడానికి కూడ సిగ్గుపడేలా, అత్మన్యూనతా భావాన్ని, భయాన్ని కలుగజేసే ప్రపంచంలో ఎక్కడా లేని ఒక మానసిక రుగ్మత సిద్దాంతo వర్ణ వ్యవస్థ ని సృష్టించిన వారి మాతృభూమి ఇరాన్ అని, ఇరాన్ ప్రజలు ఇస్లామీకరించబడక ముందు, మాట్లాడిన భాష అవెస్తన్, మన వేద సంస్కృతం భాషలు ఒకే భాష యొక్క రెండు మాండలికాలు అని కని పెట్టారు.
శూద్రులు చదవితె నాలుకలు కోసి, వింటె చెవులల్లో సీసం పోసిన, ఈ వేదాల సృష్టి కర్తలు, ఈ ఆర్యుల మాతృ భూమి ఇరాన్ అని, వీరి భాశ సంస్కృతం ఇండో-ఆర్యన్ ఇదే ఇండో-యూరోపియన్ భాశగ చెప్పారు. అంటే BJP, RSS వారి సిద్దాంతం ఇరాన్ నుండి వచ్చింది, ఈ వేదాల నిండా ఈ ఆర్యుల వర్ణ చరిత్ర మాత్రమే వుంటుందని కనిపెట్టారు, అందుకే వీరి మూలాలను గురించి చెప్పిన చరత్ర కారులంటె, వీరికి వెన్నులో వనుకు. ఈ విశయాలన్ని ప్రజలకు తెలిస్తే తరిమికొడతారని భయం. క్రి పూ , 15000 సం,, వైదిక మతం పాటించినది కులం , వర్ణ వ్యవస్థ కలదు , ఇంద్రుడు , అగ్ని దేవుళ్ళు , విగ్రహారాదన లేదు , బ్రాహ్మణులూ మాంసాహారులు , యజ్ఞ యాగాదులలో ఆవులను హోమం చేసి భుజించేవారు , అంటారని తనం లేదు.క్రి పూ , 563 బౌధమతం , పాటించినది స్వేచ్చ , సమానత్వం, సౌభ్రాతృత్వంలను గుర్తించెదిగ, ఆత్మ , పరమాత్మలను గుర్తించకుండా హెతుబద్ద ఆలోచనలకూ పదును పెట్టడం. అహింస ను బోదించడం జరిగినిది , క్రి శ 1 శతాబ్దం , బ్రాహ్మణ మతం (వైదిక మత రూపంతరత ), కులంవర్ణ తో పాటు అంటరానితనం మొదలైంది , క్షత్రియ దేవులైన కృష్ణ , రామ లను బౌద్ధానికి దీడుగా వుండాలని చేసినారు ,ఇక్కడ శూద్రుల దేవుడైన శంకరుణ్ణి బ్రహ్మ విశ్నులకు సోదరున్ని చేసినారు, గోవు హింస నిషేధం చేసి , గువులకు పవిత్రత అంతకట్టిన సందర్బం , గో పురాణం వ్రాయబడింది .
క్రి శ 12వ శతాబ్దం , హిందూ మతం (బ్రాహ్మణా మాత రూపంతారత ), అరబ్బులు రావడం , ఎక్కవగా ఇస్లాం లోకి bc/sc /st లు ఇస్లాంలోకి మారినారు , మల్లి 1792 లో విలియం కేర్ వచ్చిన తరువాత క్రిస్టియన్ లోకి వెళ్ళడం మొదలు అయినది , ఈ మతమార్పిడులు చాల వరకు హిందూ మతంలోని వివక్షను బరిన్చాలేకనే విముక్తికై ఎక్కవగా వెళ్ళినారు

మూల్ నివాసి ఎవరు..?
21 - MAY - 2001 లో టైమ్స్ అఫ్ ఇండియా ఒక వార్త వెలువడింది.
అందులో వ్రాయబడిన వార్త ప్రకారం BC, SC, ST, NT, DNT, VJNT మరియు మైనార్టి ( ముస్లీం, సిక్కు, ఇసాయి, జైన్, బౌద్ద, జార్ట్) . భారతదేశ మూలవాసులే.ఈ విషయం DNA రిపోర్టు ద్వారా ఋజువైంది.DNA ప్రతి వ్యక్తి శరీరంలో ఉంటుంది.మరియు ఒక వంశంలో ఒకరి నుండి ఒకరికి రవాణా అవుతుంది.ఈ విదంగా DNA ద్వార నిశ్చత రూపంలో ఋజువు చేయవచ్చు.BC, SC, ST, NT, DNT, VJNT మరియు మత మైనార్టీలు వీరందరూ భారతదేశ మూలవాసులే.
అర్యసమాజ్ కాదు అది యురేషియన్ సమాజము మరియు విదేశి సమాజము భారత్ లో బ్రాహ్మణులు అర్యులని పిలువబడేవారు.దీని గురించి దయానంద్ సరస్వతి అర్యసమాజ్ యొక్క స్థాపన చేశాడు.
చాలా మంది మూలనివాసి భారతీయ ప్రజలు బ్రాహ్మణులను ఆర్యులు అనేవారు.కాని 21-05-2001 తర్వాత ఆర్యన్ చమాచారం తప్పు అని ఋజువైంది.DNA అధారముతో తప్పని ఋజువు చేశారు.ఈ విషయం DNA రీసెర్చ్ ప్రయోగాలలో ఋజువైంది.కాబంటి DNA ను వ్యతిరేకించే ఏ కారణం కూడా ప్రపంచంలో అందుబాటులో లేదు.దీనిని మదిలో ఉంచుకొని ఇప్పుడు బ్రాహ్మణులు ఆర్యలు అని చేప్పరాదు.DNA ద్వార బ్రాహ్మణులు యురేషియనులు .కాబట్టి బ్రాహ్మణులను యురేషియనులని పిలవాలి.ఈ దృష్టితో ఆర్య సమాజ్ ఆర్య సమాజ్ కాదు.ఇది యురేషియన్ విదేశి సమాజం అవుతుంది....

మద్య ఆసియా ప్రాంతం నుండి మనదేశానికి వలస వచ్చిన హింసోన్మాధులైన సంచారజాతి ఆర్యులు
ఈ దేశంలో అప్పటికే సుసంపన్నంగా వర్దిలుతున్న శాంతికి నిలయమైన హరప్పా (సింధూ) నాగరికతను ధ్వంసం చేశారు.చివరికి సప్తసింధు ప్రాంతంలో స్థిర నివాసమేర్పరుచుకొని అనేక రకాల సాహిత్యం సృష్టించారు.దాని ప్రకారం బ్రహ్మ నుదుటి నుండి పుట్టినవారు బ్రాహ్మణులని వారు పూజలు చేయాలని, క్షత్రియులు రాజ్యమేలాలని, వైశ్యులు వ్యాపారం చేయాలని, శూద్రులు ప్రస్తుత (BC, SC, ST ) లు పై మూడు వర్గాలకు సేవ చేయాలని తెలిపారు.వర్ణాశ్రమ ధర్మ రక్షణకు 'మనుస్మృతి' ని సృష్టించి శూద్రులను బ్రాహ్మణులు దోపిడి చేయడానికి న్యాయబద్దతను కల్పించారు.అందుకే ఇప్పటికి బ్రాహ్మణుడు తన పూజమంత్రంలో తప్పని సరిగా 'స్వాహా' అనే పదం వాడుతాడు ( అంటే నీ సంపదంతా నాకు రానీ అని) ఆ రకంగా మన ఇంట్లో పూజచేసి మనముందటె మన ధనాన్ని తనకు అర్పితం అయ్యేలా చూడాలని దేవుడిని ప్రార్థిస్తాడు.

అర్యులు సృష్టంచిన ఈ బ్రాహ్మణియ వ్యవస్థ అంతిమంగా మూలవాసి బహుజన ( BC, SC, ST, ) కులాలను అధికారనికి, అర్దిక సంపదకు, విజ్ణాణానికి, సామజిక హోదాకు దూరం చేసింది.బ్రాహ్మణియ మనువాద వ్యవస్థ బందాలను తెంచుకొని స్వచ్చ సమనత్వం కోసమని క్రైస్తవులుగానో, ముస్లింలుగానో మారిన మన మూలనివాసి బహుజనులను విదేశీయులని ముద్రవేసి మనతోనే మన చేయి నరికే ప్రయత్నం చేస్తున్నారు.Dr. B.R Ambedkar తన స్వహస్తాలతో రచించిన భారత రాజ్యంగంలో బ్రాహ్మణీయ వ్యవస్థను బద్దలు కొట్టి అనగారిన వర్గలకు ఆత్మగౌరవం పొందగలిగే అన్ని ఏర్పాట్లు చేశాడు.కాని మన రాజ్యాంగం పై నమ్మకం లేని మనువాద బ్రాహ్మణులు ఇంకా ఈ దేశాన్ని పాలిస్తుండడంతో ఈ దేశంలో సామాజిక న్యాయం అందని ద్రాక్ష అయినది.అందుకే ఇప్పటికైనా మనం కళ్ళు తెరువాలి Bc, Sc, St మరియు Minority మతస్థులు మమేకమై ఈ దేశంలో మూలవాసి బహుజన రాజ్యాధికారన్ని చేపట్టాలి.Dr. బాబాసాహెబ్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగ స్పూర్తితో "బహుజన హితాయ , బహుజన సుఖాయ" స్పూర్తితో ఈ దేశాన్ని పాలించాలి.అదే మన మహపురుషులైన మహత్మ జ్యోతీరావు పూలే , ఛత్రపతి సాహు మహరాజ్ , DR.బాబాసాహెబ్ అంబేడ్కర్ , పేరియార్ , కాన్సీరాంములకు మనం సమర్పించే అసలు, సిసలైన నివాళి...!!!
                     ఇట్లు 
 మీ అంబేద్కర్ యువసేన ఐనఓలు

No comments:

Post a Comment